మిడుతూరు మండలంలో భారీ వర్షం కారణంగా ఎస్సీ కాలనీలో కాకిలేరు వాగు పొంగి ఎస్సీ కాలనీలోకి భారీగా వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరి ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య టిడిపి నాయకుడు ఖాతా రమేష్ రెడ్డి సందర్శించి కాలనీ వాసులను కలిసి వారి సమస్యలను తెలుసుకొని తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.