ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొరియర్ పేరుతో కాల్స్ వస్తున్నాయా.. జాగ్రత్తగా ఉండాలన్న ఎస్పీ దీపికా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 22, 2024, 05:06 PM

విజయనగరం జిల్లాలో కొరియర్ పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు ఎస్పీ దీపికా ఎం పాటిల్. ఈ కాల్స్‌ సైబర్‌ మోసాలకు సంబంధించినవని.. చాలామంది ఈ విషయం తెలియక మోసపోయారన్నారు. ఇటీవల ఫెడెక్స్ పేరుతో కాల్స్ వస్తున్నాయని.. ఎవరికైనా ఇలా కాల్స్ వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాని కోరారు. కొందరు సైబరు మోసగాళ్లు జనాలకు ఫోన్ చేసి.. తాము ఫెడెక్స్, బ్లూ డాట్ కొరియర్ నుంచి మాట్లాడుతున్నామని పరిచయం చేసుకుంటున్నట్లు తెలిపారు. ఆ వ్యక్తికి సంబంధించిన అడ్రస్, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ వంటి కొంత సమాచారాన్ని వాళ్లే చెప్పి నమ్మిస్తారన్నారు.


మనం (ప్రజలు) బుక్ బుక్ చేసిన కొరియర్ పార్శిల్స్‌లో డ్రగ్స్, ఫేక్ పాస్‌పోర్టులు,బంగారం వంటివి ఉన్నాయని.. మనీ ల్యాండరింగుకు పాల్పడుతున్నట్లుగా తాము గుర్తించినట్లు నమ్మిస్తారన్నారు ఎస్పీ దీపిక. డ్రగ్స్, తైవాన్, చైనా వంటి దేశాలకు పంపుతున్నారని తేలిందని.. కేసు కూడా నమోదయ్యిందని, విచారణ నిమిత్తం తాము సూచించిన ప్రాంతానికి దర్యాప్తు కోసం రావాల్సి ఉంటుందని బెదిరిస్తారన్నారు. ఫోన్ చేసిన సైబర్ మోసగాళ్లు.. కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ, టాస్క్‌ఫోర్స్ అధికారులతో మాట్లాడిస్తామని.. వేరే వ్యక్తులకు ఫోన్ కనెక్ట్ చేస్తారన్నారు. అప్పుడు మరో వ్యక్తి తనను సీబీ, టాస్క్‌ఫోర్స్ అధికారిగా పరిచయం చేసుకుని.. నమ్మకం కలిగిచేందుకు వారి గుర్తింపు కార్డు పేరుతో ఓ నకిలీ ఐడీ కార్డును కూడా పంపిస్తారన్నారు.


బుక్ చేసిన పార్సిల్‌లో డ్రగ్స్, బంగారం, నకిలీ పాస్‌పోర్ట్‌ల వంటి వస్తువులు ఉన్నాయని.. కేసు కూడా నమోదయ్యిందని, దర్యాప్తు నిమిత్తం తమ దగ్గరకు రావాల్సి ఉంటుందని భయపెడతారన్నారు దీపిక. తాము రాలేని పరిస్థితుల్లో ఉన్నామని చెబితే, ఆన్‌లైన్‌లో దర్యాప్తునకు హాజరుకావొచ్చని చెబుతారని.. వారికి ఒక లింక్ పంపుతారన్నారు. ఆ లింక్‌పై క్లిక్ చేసి, స్కైప్ ద్వారా దర్యాప్తుకు హాజరుకావాలని సూచిస్తారన్నారు. సైబర్ మోసగాళ్లు పంపిన లింకును క్లిక్ చేస్తే, తమ బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బులు మాయం చేస్తారన్నారు. కొన్ని సందర్భాల్లో.. తమతో మాట్లాడిన వివరాలను ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచాలని చెప్పి.. ఈ కేసుల విషయంలో సాయం చేస్తామని చెబుతారన్నారు.


ఈ కేసుల్లో సాయం చేసినందుకు, తదుపరి చర్యలు నిలిపేస్తామని నమ్మించి.. వారు సూచించిన బ్యాంకు అకౌంట్‌కు డబ్బుల్ని పంపాలని కోరుతారన్నారు జిల్లా ఎస్పీ. తమ బ్యాంక్ అకౌంట్‌ను రిజర్వు బ్యాంకు సహకారంతో పరిశీలించాల్సి ఉందని.. వివరాలు సేకరించి, అకౌంట్‌లో డబ్బును కాజేస్తారన్నారు. అందుకే ప్రజలందరూ ఇలాంటి సైబరు మోసాలు విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఫెడెక్స్, బ్లూ డాట్ వంటి కొరియర్ సర్వీసులతో వచ్చే నకిలీకాల్స్‌ను నమ్మి, సైబరు మోసాలకు గురికావద్దన్నారు. ఈ తరహా సైబరు మోసగాళ్ల కాల్స్‌కు భయపడాల్సిన అవసరం లేదని.. ఇటువంటి కాల్‌ కు ప్రజలెవ్వరూ స్పందించ వద్దని సూచించార. ఆయా నంబర్లు నుండి వచ్చే కాల్స్‌ను బ్లాక్ చేసి, సమాచారాన్ని స్థానిక పోలీసు స్టేషన్‌కు అందించాలన్నారు. ఎవరైనా డబ్బులు పోగొట్టుకుంటే 1930కు, నేషనల్ సైబరు క్రైంపోర్టల్ లో రిపోర్టు చేయాలని ప్రజలకు జిల్లా ఎస్పీ సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com