ట్రెండింగ్
Epaper    English    தமிழ்

1 పరుగు తేడాతో ఓడిపోయిన ఆర్సీబీ

sports |  Suryaa Desk  | Published : Sun, Apr 21, 2024, 08:40 PM

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా  విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. అయితే 223 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసి కేవలం 1 పరుగు తేడాతో ఓడిపోయింది.బెంగళూరు బ్యాటర్లు విరాట్ కోహ్లీ 18, ఫాఫ్ డు ప్లెసిస్ 7, విల్ జాక్స్ 55, రజత్ పాటిదార్ 52, కామెరాన్ గ్రీన్ 6, సుయాష్ ప్రభుదేసాయి 24, మహిపాల్ లోమ్రోర్ 4, లాకీ ఫెర్గూసన్ 1, దినేష్ కార్తీక్ 25, కర్ణ్ శర్మ 20 పరుగులు చేసారు. కోల్ కతా బౌలర్లలో ఆండ్రీ రస్సెల్ 3, హర్షిత్ రాణా 2, సునీల్ నరైన్ 2, మిచెల్ స్టార్క్ 1, వరుణ్ చక్రవర్తి 1 వికెట్ తీశారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com