ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా డీఎస్పీ బాలసుందరరావు బందోబస్తు పర్యవేక్షించారు. ఎలాంటి ఆటంకం కలగకుండా తగిన బందోబస్తు చర్యలు చేపట్టాలని సిఐ ఆవుల వెంకటేశ్వర్లు కు సూచించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని, అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు ఎన్నికల నిబంధనలను అనుసరించి అనుమతించాలని కోరారు.