రాష్ట్రంలో రాక్షస పాలనకు రోజులు దగ్గరపడ్డాయని మాజీ మంత్రి, ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి భూమా అఖిల ప్రియ అన్నారు. బుర్రారెడ్డిపల్లె గ్రామ సర్పంచ్ గుండ్రాతి రాజ్యలక్ష్మి, ఉప సర్పంచ్ గుండ్రాతి బాల సుబ్బయ్య, వార్డు మెంబర్లు నరేంద్ర, ఏడు కొండలు, ఓబులమ్మ, రమణమ్మ, నాగలక్ష్మి, సుజాతతో పాటు 200 కుటుంబాలు సమక్షంలో బుధవారం టీడీపీలో చేరారు. మండల మాజీ అధ్యక్షుడు భూమా బ్రహ్మానందరెడ్డి, సిద్ధి సత్యం, వెంకట్నా యుడు, దయానందరావు, రవికుమార్ ఉన్నారు.