ఎస్సీ, ఎస్టీ కేసులో శిక్ష పడిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును పదవి నుంచి తొలగించి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ద్వారా దళితుల పట్ల జగన్కు ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పొద్దోకు నారాయణరావు(బాలు) డిమాండు చేశారు. టీడీపీ ఎస్సీ సెల్ సమావేశం మండల శాఖ అధ్యక్షుడు మోర్త సత్తిబాబు అధ్యక్షతన బుధవారం ముక్తేశ్వరంలో జరిగింది. 28ఏళ్ల పాటు ప్రలోభాలకు లొంగకుండా న్యాయం కోసం పోరాడిన బాధితులకు సమావేశం అభినందనలు తెలిపింది. సమావేశంలో నియోజకవర్గ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు, లీగల్సెల్ అధ్యక్షుడు బడుగు భాస్కరజోగేష్, వస్కా శ్యామ్సుందర్, గెల్లా అశోక్, గుమ్మళ్ల సాగర్, వారా లక్ష్మీనరసింహరామ్, జంగా ప్రసాద్, పోతుల వెంకట్రావు, వారా అశోక్, కుసుమ బహుగుణ తదితరులు పాల్గొన్నారు.