మదనపల్లె స్పెషల్ సబ్జైలులో రిమాండు ఖైదీ బుధవారం ఉదయం మృతి చెందాడు. ఆర్డీఓ హరిప్రసాద్ మెజిస్టీరియల్ విచారణ చేపట్టారు. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండ లం ముత్తుకూరు వాసి పాపన్న కుమారుడు మెగిలప్ప(67) నాటుసారా విక్రయిస్తున్నాడని పోలీసులు ఈనెల 16న అరెస్టు చేసి పలమనేరు కోర్టు ఎదుట హాజరు పరచగా కోర్టు రిమాండు విధించిది. పోలీసులు మదనపల్లె సబ్జైలుకు మంగళవారం సాయంత్రం 5.30గంటలకు తీసుకొచ్చారు. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ పరిశీలించిన సబ్జైలు సిబ్బంది మొగిలప్పను జైలు బ్యారెక్లోకి పంపారు. కాగా బుధవారం మొగిలప్ప అపస్మారక స్థితిలో పడి ఉండడంతో జైలు సూపరింటెండెంట్ రామకృష్ణయాదవ్, సిబ్బంది అతడిని మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించా రు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మొగిలప్ప మృతిచెందాడని నిర్ధారించారు. మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు యమలా సుదర్శనం, మాలమహానాడు నేతలు ఆస్పత్రి వద్ద మొగిలప్ప కుటుంబీకులను విచారించారు.