అన్నమయ్య జిల్లా రాజంపేట కొత్త బోయినపల్లెలోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద విద్యార్థి సంఘాలు మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ, పిడిఎఫ్ యు, టిఎన్ఎస్ఎఫ్, ఏబీవీపీ విద్యార్థి సంఘాలు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ సోమవారం కాలేజీ ప్రాంగణంలోని హాస్టల్ గదిలో ఉరి వేసుకుని రేణుకా మహంక్ (24) అనే విద్యార్థిని అనుమానాస్పద మరణం చెందిందన్నారు. విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరపాలన్నారు.