అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం వేంపల్లి రాజీవ్ నగర్ కాలనీలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్నిమాపక కేంద్రం ఇంఛార్జి అధికారి టి. కృష్ణమూర్తి ఆధ్వర్యంలో సిబ్బంది అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. వంట చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. వంట చేసే క్రమంలో ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించినప్పుడు ఏ విధంగా అదుపు చేయాలో డెమో ద్వారా చూపించారు.