కొరిసపాడు మండలం మేదరమెట్లలోని ప్రాథమిక పాఠశాల నందు మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 104 వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో మండల వైద్యాధికారిణి డాక్టర్ నిఖిల రెడ్డి పాల్గొని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. 104 వైద్య శిబిరం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు డాక్టర్ నిఖిల రెడ్డి తెలియచేశారు. 104 సేవలను వినియోగించుకోవాలని కోరారు.