ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు తో పాత్రికేయుల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్యారంటీల పత్రాన్ని నియోజక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ సైదా, కూటమి నాయకులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సోమయ్య సిపిఐ నాయకులు అందె నాసరయ్య ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.