ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం మాజీ సైనికులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నాగార్జున రెడ్డి మాట్లాడుతూ. 2024 అసెంబ్లీ ఎన్నికలలో తనను ఆదరించి తనకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తనను గెలిపిస్తే మార్కాపురం ఎలా అభివృద్ధి చేశానో అదేవిధంగా అభివృద్ధి చేస్తానని కుందూరు నాగార్జున రెడ్డి అన్నారు.