పులివెందులలోని వ్యవసాయ మార్కెట్లో చీనీ ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో చీనీ పంటలు పండించే రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం పులివెందుల వ్యవసాయ మార్కెట్లోని చీనీ కొనుగోలు కేంద్రంలో మేలురకం, నాణ్యమైన చీనీ కాయలు టన్ను ధర రూ. 26, 500లు ఉండగా, ఒకరకమైన చీనీకాయలు టన్ను ధర రూ. 21, 500లు పలుకుతున్నట్లు మార్కెట్ యార్డు అధికారులు తెలిపారు.