టిడిపి జనసేన బిజెపి కూటమి తోనే బీసీలకు రక్షణ ఉంటుందని రాయచోటి టిడిపి అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. గురువారం సంబేపల్లి మండలంలో ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. కూటమి అధికారంలోకి రాగానే బీసీల అభ్యున్నతికి ప్రత్యేక రక్షణ చట్టం అమలు చేస్తామని ఆయన తెలియజేశారు.