గత 42 ఏళ్లుగా జన సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి టిడిపి అంకితమై పనిచేస్తోందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చెప్పారు. టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం మార్టూరులోని పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బాపట్ల లోక్సభ టిడిపి అభ్యర్థి కృష్ణ ప్రసాద్ కూడా పాల్గొన్నారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆశయాల సాధనకు చంద్రబాబు సారధ్యంలో తామంతా కృషి చేస్తున్నామని వారు చెప్పారు.