ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఒంగోలు ఆర్డీవో, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి పై కలెక్టర్ దినేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల సంబంధిత అంశాలపై కలెక్టర్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో బుధవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి వివరాలు సేకరిస్తుండగా, ఒంగోలు ఆర్వో మాత్రం వివరాలు అందించలేదు. దీంతో ఆర్ఓ పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.