కనిగిరి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహరెడ్డి ఆధ్వర్యంలో సీస్ పురం పాడు మండలం పెదరాజుపాలెం కి చెందిన పలు కుటుంబాల మంగళవారం వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఉగ్ర నరసింహ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.