కందుకూరు పట్టణంలో డిఎస్పి శ్రీనివాసరావు ఆధ్వర్యలో మంగళవారం పోలీసులు కవాతు నిర్వహించారు. స్థానిక పట్టణంలోని పామూరు రోడ్డు, కనిగిరి రోడ్డు ఓవి రోడ్డులో కవాతు నిర్వహించారు. సీఐ నఫీజ్ భాష, పట్టణ ఎస్ఐ ఆనంద భాస్కర్ కేంద్ర బలగాలు ఈ కవాతులో పాల్గొన్నాయి. సీఐ మాట్లాడుతూ రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా ప్రజలతో మమేకం అయ్యేందుకు ఈ కవాతు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.