అద్దంకి మండలం అద్దంకి పట్టణంలో 11వ వార్డు నందు వైయస్సార్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం శుభోదయం అద్దంకి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి వైయస్సార్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి హనిమిరెడ్డి పాల్గొని వార్డులో పర్యటించారు. ప్రజలతో మమేకమై వారితో టీ తాగుతూ వారి సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రజలు సంతోషంగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆయన తెలిపారు.