గిద్దలూరు మండలం గడికోట పంచాయతీలోని పరమేశ్వర్ నగర్ లో సోమవారం దారుణం చోటుచేసుకుంది. ప్రజాగళం సభకు వెళ్లాడు అనే నెపంతో టిడిపి కార్యకర్త మునయ్యపై వైసీపీ వర్గీయులు గొడ్డలితో దాడి చేశారు. దీంతో మునయ్య తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ మునయ్యను మొదట గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.