యద్దనపూడి మండలం పూనూరు గ్రామానికి చెందిన పలువురు టిడిపి నేతలు సోమవారం పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ యడం బాలాజీ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయన వారికి పార్టీ కండువాలు కప్పి సాదర స్వాగతం పలికారు. వైసీపీలో తగిన ప్రాధాన్యమిస్తామని ఈ సందర్భంగా బాలాజీ వారికి హామీ ఇచ్చారు. మొత్తం 50 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఈ కార్యక్రమంలో పూనూరు గ్రామ సర్పంచ్ మేక సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.