రాచర్ల మండలం రాచర్ల పారంకు చెందిన ఇద్దరు మైనర్ బాలికలు జనవరి 29వ తేదీన అదృశ్యమయ్యారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదులతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు వారికి మాయ మాటలు చెప్పి తీసుకు వెళ్లినట్లుగా గుర్తించారు. బాలికలను తమ పాటు తీసుకువెళ్లిన ఇద్దరి యువకులపై కేసు నమోదు చేసి కోర్టుల ప్రవేశ పెట్టమని డిఎస్పి బాలసుందర్రావు వెల్లడించారు.