సీనియర్ జాతీయ మినీ గోల్ఫ్ ఛాంపియన్ షిప్ లో ఎం. అఖిల్ సాయి రజిత పథకం సాధించడం ఎంతో గర్వంగా ఉందని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మెన్ పయనం ఏడుకొండలు రెడ్డి అన్నారు. సోమవారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటుచేసిన అభినందన సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మినీ గోల్ఫ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరియు మహారాష్ట్ర మినీ గోల్ఫ్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన పోటీలలో విద్యార్థులు విజయం సాధించారన్నారు.