కుందుర్పి మండలం ఎనుములదొడ్డి జడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థులు ఆటోలలో వెనక భాగంలో పట్టుకొని తమ గ్రామాలకు ప్రయాణిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలన్నా సమయానికి బస్సులు లేకపోవడంతో ఆటోలలో వెనక భాగంలోనూ, పక్కల ఉన్న కడ్డీలను పట్టుకొని ప్రమాదపు టంచులలో ప్రయాణం సాగిస్తున్నారన్నారు. విద్యార్థుల పాఠశాల సమయానికి బస్సు ఏర్పాటు చేయాలని కోరారు.