ధర్మవరం పట్టణంలోని ప్రధాన రహదారుల్లో మంగళవారం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు తేరుబజారు, నేసే పేట, ఎన్టీఆర్ సర్కిల్, కేశవ నగర్ శివానగర్ లో ఈ కవాతు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అసాంఘిక శక్తులు చెలరేగి పోకుండా ప్రజలకు భరోసా కల్పించడం కోసమే ఈ కవాతు నిర్వహించినట్లు పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.