రాష్ట్రంలో ఒంటిపూట బడులు నిర్వహిస్తున్న సందర్బంగా ఉదయం 10 గంటలకే విద్యార్థులకు భోజనం అందేలా భోజన విరామ సమయాన్ని మార్చాలని ఏపీఎస్ ఈ ఏ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ విద్యాశాఖ అధికారులను కోరారు. ఈ మేరకు మంగళవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాలకు వచ్చేటప్పుడు ఎటువంటి ఆహారం తినకుండా వచ్చి మధ్యాహ్నం 12:30 వరకు ఎలా ఉండగలరు అని ఆయన ప్రశ్నించారు.