కంబదూరు చెక్ పోస్ట్ (ఆంధ్ర కర్ణాటక బోర్డర్ చెక్ పోస్ట్)ను కళ్యాణదుర్గం ఆర్డీవో రాణి సుస్మిత మంగళవారం సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున చెక్ పోస్ట్ నందు తనిఖీలను సమర్ధవంతంగా చేపట్టాలన్నారు. బాధ్యతల నందు ఎలాంటి నిర్లక్ష్యం చూపకుండా విధులు చేపట్టాలని సంభందించిత అధికారులకు తెలియజేశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.