గుత్తి పట్టణ శివారులోని కొత్తపేట జాతీయ రహదారి వంతెన వద్ద గంజాయి విక్రయిస్తున్న సాయి, విజయ్ అను ఇద్దరిని సోమవారం అరెస్టు చేసి వారి నుంచి 800 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెంకట్రామి రెడ్డి తెలిపారు. వారిపై కేసులు నమోదు చేశామని ఆయన తెలిపారు. గంజాయి అమ్మకాలు చేస్తున్న వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని సీఐ తెలిపారు. దాడుల్లో ఎస్సై నబీ రసూల్ సిబ్బంది పాల్గొన్నారు.