పల్నాడు జిల్లా, మాచర్లలో టీడీపీ నేత కారును అల్లరి మూకలు తగులబెట్టాయి. 10వ వార్డుకి చెందిన టీడీపీ నేత వీర్ల సురేష్కి చెందిన మారుతి బ్రిజా కారును వైసీపీ కార్యకర్తలు తగలబెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. తన ఇంటి ముందు కారు నిలుపు చేసేందుకు స్థలంలేక పోవడంతో తన ఇంటికి సమీపంలోని సెయింట్ జేవీఆర్ స్కూల్ గేట్ ముందు సురేష్ పార్కింగ్ చేశాడు. అర్ధరాత్రి సమయంలో మంటల్లో కారు తగలబడటాన్ని సురేష్ కుటుంబ సభ్యులు గమనించారు. ఇది కచ్చితంగా వైసీపీ వాళ్లు చేసిన పనేనని సురేష్ ఆరోపిస్తున్నాడు.