ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరికి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు హుటాహుటిన హస్తినకు బయలుదేరి వెళ్లారు. పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ సీట్లు, 10 అసెంబ్లీ సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే పాడేరు, అనపర్తి, ఆదోనితో పాటు మరికొన్ని సీట్లపై కమలం పార్టీ అభ్యంతరం తెలుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొన్ని సీట్లలో మార్పులు ఉంటాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై చర్చిచందేకు పురందేశ్వరి ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. ఈ నెల 21లోపు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.