కడప జిల్లా, ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారం చేస్తున్న వైసీపీ అభ్యర్ధిని ఎన్నికల అధికారులు అడ్డుకున్నారు. ఉదయం ఏడు గంటలకు రాచమల్లు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. విషయం తెలిసిన ఎన్నికల అధికారుల బృందం 9:30 గంటలకు ప్రచారం వద్దకు చేరుకుంది. అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. దీంతో చేసేదేమీ లేక రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వెనుదిరిగి వెళ్లిపోయారు.