ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ భారీ కుట్రలకు తెరతీసింది. నెల్లూరు సిటీలో మాజీ మంత్రి నారాయణపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ దుశ్చర్యలకు పాల్పడుతోంది. ఈ వ్యవహారంపై నారాయణ స్పందిస్తూ.. అసత్య ప్రచారాలు, ఎంపీ విజయసాయి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ పార్టీలో ఆయన నెంబర్-2 కదా... గత ఐదేళ్లుగా నెల్లూరుకి ఏం చేశారు? సొంతూరని అప్పుడు గుర్తుకి రాలేదా? అని ప్రశ్నలు కురిపించారు. వైసీపీ చెప్పే కల్లబొల్లి మాటలు, అసత్య ప్రచారాలని ప్రజలు నమ్మరన్నారు. టీడీపీ హయాంలో రూ.5263 కోట్లతో తాము చేసిన అభివృద్ది ప్రజలకి కనిపిస్తుందన్నారు. రూ.1100 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అండర్ గ్రౌండ్, ఇంటింటికీ మినరల్ వాటర్ పథకాలు నిర్మించామన్నారు. చివరి దశ పనులు పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. . మున్సిపాల్టీపై భారమంటూ అసత్యప్రచారాలు సాగిస్తున్నారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.