వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అమలాపురం జనసేన ఇన్చార్జి శెట్టిబత్తుల రాజబాబు రహస్యంగా కలిసిన ఘటన ఏపీలో సంచలనంగా మారింది. గత రాత్రి మిథున్ రెడ్డిని కలిసి బయటకు వస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమలాపురం టిక్కెట్ టీడీపీకి కేటాయిస్తున్నారనే ప్రచారంతో జనసేనపై రాజబాబు ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఆయన కొన్ని రోజులుగా అందుబాటులో లేకుండా వెళ్లిపోయారు. జనసేన నాయకులకు ఎవరికీ తెలియకుండా రహస్యంగా మిథున్ రెడ్డిని రాజబాబు కలిశారు. మిథున్ రెడ్డిని కలిశారనే ప్రచారంతో రాజబాబుపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమలాపురం టిక్కెట్ జనసేనకు కేటాయించాలని కొన్ని రోజులుగా అమలాపురంలో జనసేన నేతలు ఆందోళనలు చేస్తున్నారు.