ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో విజయవాడ సీపీ కాంతిరాణా రాజకీయ నాయకులకు, ప్రజలకు, సోషల్ మీడియా యూజర్లుకు కీలక సూచనలు చేశారు. ఎన్నికల నిబంధనలు పాటించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇదే విషయమై మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన కాంతిరాణా.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఇప్పటి వరకు రూ. 4.19 కోట్లు సీజ్ చేశామన్నారు. అక్రమంగా తరలిస్తున్న 23 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.