ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుకన్య సమృద్ధి ఖాతాదారులకు అలర్ట్.. ఇంకొన్ని రోజులే.. ఈ పని చేయకుంటే అకౌంట్ ఫ్రీజ్, పెనాల్టీ!

business |  Suryaa Desk  | Published : Sun, Mar 17, 2024, 11:20 PM

పెట్టుబడులు పెట్టేందుకు మనకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిల్లో చిన్న మొత్తాల పొదుపు పథకాలపై చాలా మందికి ఎక్కువ ఆసక్తి ఉంటుంది. వీటిల్లో డిపాజిట్లు కొంత కాలంగా పెరిగాయి కూడా. ప్రభుత్వ మద్దతు ఉండటం.. ఆకర్షణీయ స్థాయిలో వడ్డీ రేట్లు ఉండటం గమనించొచ్చు. ఈ లెక్కన గ్యారంటీ రాబడి కూడా ఉంటుంది. చిన్న మొత్తాల్లో కూడా డిపాజిట్లు చేసేందుకు అవకాశం ఉంటుంది. స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను కేంద్రం ప్రతి 3 నెలలకు ఓసారి సవరిస్తుంటుంది. వీటిల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ పెన్షన్ సిస్టమ్, సుకన్య సమృద్ధి యోజన వంటివి అత్యంత ఆదరణ పొందాయని చెప్పొచ్చు.


>> ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్రం తీసుకొచ్చిన ఎన్నో పొదుపు పథకాల్లో వీటి గురించి ప్రధానంగా చెప్పుకోవచ్చు. వీటిల్లో ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80c కింద ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు పన్ను ఆదా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. NPS లో గరిష్టంగా రూ. 2 లక్షలు టాక్స్ బెనిఫిట్ పొందొచ్చు.


>> దేశంలోని అన్ని పోస్టాఫీసులు సహా బ్యాంకుల్లో ఈ స్కీమ్ అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా సుకన్య సమృద్ధి అకౌంట్ ఆడపిల్లల కోసం ఉద్దేశించింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఉద్యోగం చేసే వారికి అనువుగా ఉంటుంది. వీటిల్లో ఏడాదికి కొంత ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మంచి రాబడి అందుకోవచ్చు.


>> ఈ పొదుపు పథకాల్లో కనీస డిపాజిట్ అనేది ఉంటుంది. అంటే ఒకసారి స్కీంలో చేరాక ప్రతి ఏటా కచ్చితంగా కొంత మొత్తం కట్టాల్సిందే. లేకపోతే అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. మళ్లీ కట్టకుంటే అది క్లోజ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఖాతా తిరిగి తెరవాలన్నా కూడా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.


>> సుకన్య సమృద్ధి స్కీంలో కనీస డిపాజిట్ ఏడాదికి రూ. 250. గరిష్టంగా రూ. 1.50 లక్షలు డిపాజిట్ చేయొచ్చు. ఏడాదిలో ఎప్పుడైనా కట్టొచ్చు. విడతల వారీగా కూడా పే చేయొచ్చు. అంటే కనీసం ఏడాదిలో రూ. 250 అయినా డిపాజిట్ చేయాలన్నమాట.


>> పీపీఎఫ్ పథకంలో కనీస పెట్టుబడి రూ. 500 .. గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు జమ చేయొచ్చు. ఇక్కడ ట్రిపుల్ టాక్స్ బెనిఫిట్ ఉంటుంది. పెట్టుబడిపై, వడ్డీ రాబడిపై, మొత్తం మెచ్యూరిటీ విలువపై టాక్స్ తగ్గించుకోవచ్చు.


>> ఇక ఈ పథకాల్లో ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఆర్థిక సంవత్సరం కింద చూస్తారు. అంటే ఈ అకౌంట్ తెరిచిన వారు ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీస మొత్తం (మినిమం డిపాజిట్) డిపాజిట్ చేయాల్సిందే. ఇప్పుడు మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియబోతోంది గనుక ఈ పథకాల్లో చేరిన వారు ఇంకా ఎవరైనా డిపాజిట్ చేయకుంటే ఇప్పుడే చేసుకోవాలి. లేకపోతే అకౌంట్ నిలిచిపోతుంది. పెనాల్టీ కడితేనే మళ్లీ అకౌంట్ ఓపెన్ అవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com