పంటలకు కనీస మద్దతు ధర(MSP)పై చట్టపరమైన హామీ కోసం ఉద్యమిస్తున్న రైతులు ఆదివారం రైల్ రోకో చేపట్టనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రైల్ రోకో నిర్వహించనున్నారు.
రైతు సంఘాల నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ ఆదివారం ఉదయం మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ‘రైల్ రోకో’కు పిలుపునిచ్చామని, దేశంలోని రైతులు, కూలీలు, సామాన్య ప్రజలందరూ తమకు మద్దతివ్వాలని కోరారు.