ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్కూల్ టీచర్‌తో యువకుడి ఎఫైర్.. రెండు కుటుంబాల్లో విషాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 27, 2024, 10:50 PM

విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను దారుణంగా నరికిన యువకుడు ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో యువకుడు చనిపోగా.. మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. శ్రీనగర్ కాలనీలో జరిగిన ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనగర్ కాలనీకి చెందిన ఓ మహిళకు గుడివాడకు చెందిన వ్యక్తితో పెళ్లైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే స్కూళ్లో టీచర్‌గా పనిచేస్తున్న మహిళకు అక్కడే ఓ యువకుడితో పరిచయమైంది. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే బాధితురాలు కొంతకాలం క్రితం గుడివాడ నుంచి విజయవాడకు వచ్చేసింది. దీనిపై ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తనను వదిలేసి వచ్చిందనే కోపంతో ఆ యువకుడు విజయవాడకు వచ్చి మహిళపై దాడి చేశాడు. కత్తితో విచక్షణారహితంగా నరికాడు. అయితే యువకుడి దాడిలో తీవ్రంగా గాయపడిన వివాహిత.. రక్తపు మడుగులో పడిపోయింది.


దీంతో మహిళ చనిపోయిందని నిర్ధారించుకున్న యువకుడు.. ఆపై ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న సత్యనారాయణపురం పోలీసులు.. కొనఊపిరితో ఉన్న యువతిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటన మీద కేసు నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com