ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ రైతులకు శుభవార్త.. రేపే అకౌంట్లలోకి డబ్బులు.. బటన్ నొక్కనున్న జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 27, 2024, 10:12 PM

రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వైఎస్ఆర్ రైతుభరోసా- పీఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరం మూడో విడత నిధులను.. బుధవారం( ఫిబ్రవరి 28న) రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తారు. మూడో విడతగా ఒక్కొక్కరికి మరో రూ.2,000 చొప్పున 53.58 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి 1,078.36 కోట్లను సీఎం జగన్ విడుదల చేయనున్నారు.


వైఎస్ఆర్ రైతుభరోసా- పీఎం కిసాన్ యోజన పథకం కింద ఒక్కొక్క రైతుకు ఏటా రూ. 13,500 చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకుపెట్టుబడి సాయం అందిస్తున్నాయి. గడిచిన ఐదేళ్లుగా కేంద్రం వాటా కింద ఆరువేల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం తరుఫున 7500 రూపాయలు ఏటా రైతుకు సాయంగా అందిస్తున్నాయి. తాజాగా అందిస్తున్న 2 వేల రూపాయల సాయంతో కలిసి ఒక్కో రైతుకు ఈ 57 నెలల్లో 67వేల 500 రూపాయలు అందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.


మరోవైపు వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీని కూడా సీఎం జగన్ రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు. 2021-22 రబీ సీజన్‌, 2022 ఖరీఫ్ సీజన్‌లో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 10,78,615 మంది రైతన్నలకు రూ. 215.98 కోట్ల వడ్డీ రాయితీ సొమ్మును బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. మొత్తంగా రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ కింద అర్హులైన 64.37 లక్షల రైతు కుటుంబాలకు రూ.1,294.34 కోట్ల సాయం అందించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com