ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జేఈఈ మెయిన్స్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

Education |  Suryaa Desk  | Published : Fri, Dec 01, 2023, 01:21 PM

జేఈఈ మెయిన్స్‌ తొలి విడతకు దరఖాస్తు గడువును డిసెంబరు 4వ తేదీ (రాత్రి 9 గంటల) వరకు పొడిగించారు. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) సవరించిన టైమ్ టేబుల్ ను వెల్లడించింది. గురువారం రాత్రితో గడువు ముగియగా దాన్ని డిసెంబరు 4వ తేదీ వరకు పొడిగించింది. సమర్పించిన దరఖాస్తుల్లో పొరపాట్లు ఉంటే వెబ్‌సైట్‌లో డిసెంబరు 6 నుంచి 8వ తేదీ వరకు సవరించుకోవచ్చని పేర్కొంది. కాగా తొలి విడత ఆన్‌లైన్‌ పరీక్షలు జనవరి 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com