ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంద్రకీలాద్రిపై నెపాలు మోపడం సరికాదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 18, 2023, 11:22 AM

ఇంద్రకీలాద్రి లో దసరా శరాన్నవ రాత్రి ఉత్సవ ఏర్పాట్లు బ్రహ్మండంగా ఉన్నాయి. కొంతమంది రాజకీయ నాయకులు ఏదో ఒకటి మాట్లాడి బురద చల్లాలని చూడడం సరికాదు. మీడియాలో మాట్లాడి చర్చ చేయడం వారికి అలవాటుగా మారింది అని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయంలో రాత్రికి రాత్రే గోశాలను తొలగించారు. వినాయక గుడి పగల గొట్టారు. ఆ పార్టీ నేతలు ఇప్పుడు నీతి వ్యాఖ్యలు మాట్లాడటం శోచనీయం. గత ప్రభుత్వం కంటే ఇప్పుడు సామాన్య భక్తులకు కూడా త్వరగా దర్శనం అయ్యేలా దేవాదాయ శాఖ అధికారులు, పాలక మండలి సభ్యులు ఏర్పాట్లు చేశారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు రాబోయే రోజుల్లో దుర్గగుడి మరింత అభివృద్ధి చెందుతోంది’’ అని వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com