విధి విచిత్రమైనదని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఇదిలావుంటే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు మద్దతుగా రేపు రాత్రి 7 గంటల నుంచి ఐదు నిమిషాల పాటు 'మోత మోగిద్దాం' కార్యాచరణకు టీడీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అందుబాటులో ఏది ఉంటే అది మోగించాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. "విధి విచిత్రమైనది! నాడు కాపు ఉద్యమంలో పళ్లాలు కొట్టినవారిని మక్కెలు విరగ్గొట్టి బొక్కలో వేశావ్! ఇప్పుడు అవినీతిలో కేసులో బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్.. వారేవా!" అంటూ ఎక్స్ లో పోస్టు చేశారు.