ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కక్షపూరిత రాజకీయాలు మాని ప్రజల గురించి ఆలోచించండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 25, 2023, 02:44 PM

రాష్ట్ర ప్రభుత్వం  ప్రజల సమస్యల గురించి ఆలోచించడం మానేసిందని, గత 15 రోజులుగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుని వేధించడం తప్ప ఇంకేమీ లేదని ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ వాపోయారు. కక్షపూరిత రాజకీయాలు పక్కన పెట్టి రైతులు, ప్రజల గురించి ఆలోచించాలని హితవుపలికారు. శాంతి భద్రతల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. పోలీస్ యంత్రాంగం యావత్తు అధికార పార్టీ సేవలో ఉందని మండిపడ్డారు. సాక్షాత్తు తిరుమల కొండపై బస్సు కూడా దొంగతనం చేశారన్నారు. రాయలసీమ ప్రాంతం గురించి ఒక్క ప్రజా ప్రతినిధి కూడా మాట్లాడటం లేదన్నారు. ‘‘మా రాజధాని మాకు కావాలి... రాయలసీమ లో రాజధాని పెట్టాలి’’ అని డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com