రాచర్ల మండలం ఎడవల్లి గ్రామంలో మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వనిత క్లబ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాముల విగ్రహాలను ఏర్పాటు చేశారు. వనిత క్లబ్ సభ్యుల ఆహ్వానం మేరకు జిల్లా గవర్నర్ వెంకట చంద్రశేఖర్ హాజరై విగ్రహాలను ఆవిష్కరించారు. జాతీయ నాయకులను గుర్తించుకొని వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వనిత క్లబ్ సభ్యులు అన్నారు.