ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరెంట్ పోల్ ఏర్పాటు చేస్తుండగా ఘోర ప్రమాదం.... ఎనిమిదిమంది కూలీల మరణం

national |  Suryaa Desk  | Published : Mon, May 29, 2023, 10:19 PM

కరెంట్ పోల్ ఏర్పాటు చేస్తుండగా అది ప్రమాదవశాత్తూ హై టెన్షన్ వైర్ల మీద పడిపోయింది. విద్యుత్ సరఫరా కావడంతో కరెంట్ షాక్‌కు గురై 8 మంది కూలీలు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాదకర ఘటన జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లా నిశ్చిత్‌పూర్‌లో సోమవారం (మే 29) చోటు చేసుకుంది. 25 వేల వోల్టుల విద్యుత్ ప్రసారమయ్యే హైటెన్షన్ వైర్లపై పోల్ పడిపోయిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరి కొంత మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.


హౌరా - న్యూ ఢిల్లీ రైల్వే మార్గంలో ధన్‌బాద్, గోమో మధ్య నిశ్చిత్‌పూర్ రైల్వే గేట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 8 మంది కూలీలు మృతి చెందడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఈ ఘటన కారణంగా ఈ మార్గంలో నడిచే పలు రైళ్లను వివిధ స్టేషన్లలో నిలిపివేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com