ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాటిి నుంచి నేటి వరకు వాయేజర్-2 నౌక పయనిస్తూనే ఉంది

international |  Suryaa Desk  | Published : Fri, Apr 28, 2023, 10:19 PM

రోదసి పరిశోధనల్లో అన్ని దేశాల కంటే ముందున్న దేశం అమెరికా. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఖగోళ రహస్యాల ఆవిష్కరణల్లో అగ్రగామిగా ఉంది. కాగా, 1977లో అమెరికాలో వాయేజర్-1, వాయేజర్-2 అనే అంతరిక్ష నౌకలను ప్రయోగించింది. అనంత విశ్వంలో దాగి ఉన్న రహస్యాల గుట్టు విప్పడమే ఆ నౌకలను ప్రయోగించడం వెనకున్న ముఖ్య ఉద్దేశం. 


వాటిలో వాయేజర్-2 నౌక ఇప్పటికీ ప్రయాణిస్తూనే ఉందన్న విషయం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ స్పేస్ క్రాఫ్ట్ సూర్యుడ్ని కూడా దాటిపోయింది. మన సౌర వ్యవస్థ ప్రభావం ఏమాత్రం లేని శూన్యంలో ప్రయాణిస్తోంది. వాయేజర్-2 నౌక ప్రస్తుతం భూమి నుంచి 2 వేల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. భూమి నుంచి ఏదైనా సిగ్నల్ పంపితే, ఈ నౌకను చేరుకోవడానికి ఒకటిన్నర రోజు సమయం పడుతోంది. 


ఇదిలావుంటే


ఇదిలావుంటే వాయేజర్-2 2026 వరకు భేషుగ్గా పనిచేస్తుందని అమెరికా అంతరిక్ష విభాగం ఇంజినీర్లు చెబుతున్నారు. ఇది బ్యాకప్ పవర్ ను ఉపయోగించుకునేలా వారు భూమి నుంచి సిగ్నల్స్ పంపారు. అంతేకాదు, వాయేజర్-2లో ఉన్న పరికరాలను కూడా మరికొన్నాళ్లపాటు పనిచేయించనున్నారు. ఈ నౌకలో ఉన్న శక్తిని పొదుపుగా వాడేందుకు అందులోని కొన్ని పరికరాలను స్విచాఫ్ చేశారు. దాంతో శక్తి ఆదా అవుతుందని, తద్వారా అంతరిక్ష నౌక మరికొన్నాళ్లు సేవలు అందిస్తుందని ఇంజినీర్లు వెల్లడించారు. 


వాయేజర్-2లో శక్తి కోసం రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ ను పొందుపరిచారు. ఇది ప్లూటోనియం నుంచి ఉత్పన్నమయ్యే వేడిని శక్తిగా మార్చుతుంది. ప్రస్తుతం ఈ నౌక శూన్యంలో ప్రయాణిస్తూ, అంత దూరం నుంచి డేటాను భూమికి పంపిస్తుండడం వల్ల శక్తిని కోల్పోతోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com