national | Suryaa Desk | Published :
Fri, Apr 28, 2023, 11:03 AM
తమిళనాడులో వరకపురం బీజేపీ నేత పీపీజీ శంకర్ గురువారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్సీ ఎస్టీ విభాగం రాష్ట్ర కోశాధికారిగా పనిచేస్తున్న ఆయన విధులు ముగించుకొని ఇంటికి బయలుదేరారు. నజరత్పేట జంక్షన్ వద్దకు కారు చేరుకోగానే ఓ ముఠా కారుపై నాటు బాంబు విసిరింది. దీంతో శంకర్ కారు దిగి పరుగు తీస్తుండగా ఆయనను వెంబండించి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com