పిడుగుల బీభత్సానికి పలు ప్రాంతాల్లో 14 మంది మృతి చెందారు. పశ్చిమ బెంగాల్లో గురువారం సాయంత్రం వర్షాలు కురిశాయి. ఈ సమయంలో పిడుగుపాటుకు 14 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. పుర్బా బర్ధమాన్ జిల్లాలో నలుగురు, ముర్షిదాబాద్, నార్త్ 24 పరగణాల్లో ఇద్దరు మృతి చెందినట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికారి తెలిపారు. పశ్చిమ్ మిడ్నాపూర్, హౌరా రూరల్ జిల్లాల్లో మరో ఆరుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.