వచ్చే నెల ప్రారంభంలో భారత్లో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్సిఓ) సమావేశానికి రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ హాజరవుతారని రష్యా అధికారులు గురువారం తెలిపారు.మే 4, 5 తేదీల్లో గోవాలో ఎస్సిఓ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. భారత్లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) సభ్య దేశాల విదేశాంగ మంత్రుల మండలి సమావేశంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ పాల్గొంటారని రష్యా అధికారి ఒకరు తెలిపారు.