ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైన్ స్నాచింగ్ చేస్తూ... బెంగళూరులో మిస్టర్ ఆంధ్ర అరెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 26, 2023, 08:19 PM

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మిస్టర్ ఆంధ్రా కాంపిటీటర్ బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలో చైన్ స్నాచింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. కడప రవీంద్రనగర్‌కు చెందిన సయ్యద్ బాషా 2005 నుంచి 2015 వరకు కువైట్‌లో కారు డ్రైవర్‌గా పని చేశాడు. కొంతకాలం తర్వాత ఆ ఉద్యోగం మానేశాడు.. కువైట్‌లోనే ఉంటూ బంగారం స్మగ్లింగ్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సయ్యద్ కరోనా సమయంలో తిరిగి సొంత ఊరికి వచ్చాడు. మిస్టర్‌ ఆంధ్రా పోటీల్లో పాల్గొని మూడో స్థానంలో నిలిచాడు.


సయ్యద్ ఈజీ మనీ కోసం అలవాటుపడ్డాడు.. సులభంగా డబ్బు సంపాదించేందుకు చోరీలు మొదలు పెట్టాడు. కడపలో దొంగతనాలు చేస్తూ జైలుకు కూడా వెళ్లాడు. అక్కడ జైల్లో పరిచయమైన ఓ ఖైదీతో కలిసి బెంగళూరుకు మకాం మార్చాడు. చోరీలు చేసి డబ్బులు సంపాదించాలని అనుకున్నారు. బెంగళూరులో వరుసగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. గిరినగర, సుబ్రహ్మణ్యపుర పోలీస్ స్టేషన్ల పరిధిలో గొలుసు దొంగతనాలు చేశారు.


వీళ్లు స్నాచింగ్ కోసం బైక్‌లు కూడా దొంగిలించేవారు. ఒంటరిగా వెళ్లే మహిళలను టార్గెట్ చేసి బంగారు నగలను ఎత్తుకెళ్లేవాడు. ఎవరికీ అనుమానం రాకుండా సయ్యద్ మొబైల్ కూడా ఉపయోగించకుండా తిరిగేవాడు. అతడు మొత్తం 32 నేరాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సయ్యద్‌తో పాటూ ఆయూబ్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు బెంగళూరు పోలీసులు. వీరిద్దరి దగ్గర నుంచి రూ.6 లక్షల విలువ చేసే బంగారు నగలు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.


పోలీసులు విచారణ చేస్తున్న క్రమంలో అతడు మిస్టర్ ఆంధ్రప్రదేశ్ పోటీల్లో మూడో ప్లేస్‌లో నిలిచినట్లు తెలిసింది. లగ్జరీ జీవితం గడపడానికి సయ్యద్ బాషా, ఆయూబ్‌‌తో కలిసి బెంగళూరులో చైన్ స్నాచింగ్ లు చేస్తున్నట్లు బెంగళూరు పోలీసులు చెప్పారు. మిస్టర్ ఆంధ్రా కాంపిటీటర్ ఇలా చైన్ స్నాచింగ్ కేసులో అరెస్ట్ కావడం చర్చనీయాంశమైంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com