ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్ న్యూస్

national |  Suryaa Desk  | Published : Wed, Feb 01, 2023, 01:24 PM

ఎలక్ట్రిక్ వాహనదారులకు హ్యుందాయ్ సంస్థ గుడ్ న్యూస్ అందించింది. హైదరాబాద్-విజయవాడ మధ్యలో నార్కెట్‌పల్లె వద్ద, ఢిల్లీ-చండీగఢ్ హైవేపై కురుక్షేత్ర ప్రాంతంలో 2 డీసీ అల్ట్రా-ఫాస్ట్ పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. 2023 ప్రథమార్థంలో ఇలాంటి మొత్తం 10 యూనిట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించింది. క్రమంగా ఈ సంఖ్య పెంచే యోచనలో ఉన్నట్లు తెలిపింది.


ప్రతి ఛార్జింగ్ స్టేషన్‌లో ఒక యూనిట్ డీసీ 150kW అల్ట్రా-ఫాస్ట్ ఛార్జర్, ఒక యూనిట్ డీసీ 60kW హై-స్పీడ్ ఛార్జర్ ఉన్నాయి. ఇవి ఫిబ్రవరి 1 నుండి ఎలక్ట్రిక్ వాహనాల యజమానులకు అందుబాటులో ఉంటాయి. కంపెనీ ఢిల్లీ-జైపూర్, ముంబై-పూణే, మరియు బెంగళూరు-చెన్నై హైవేలపై మరియు ఢిల్లీ-NCR, ముంబై, చెన్నై, బెంగళూరు మరియు హైదరాబాద్ వంటి నగరాల్లో ఇతర ఛార్జింగ్ స్టేషన్లను ఇన్‌స్టాల్ చేస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com